మాజీ కలెక్టర్ ఇంతియాజ్ కు ఊరట... వారెంట్‌ను రీకాల్ చేసిన హైకోర్టు

Arun Kumar P   | Asianet News
Published : Jul 21, 2021, 03:02 PM IST
మాజీ కలెక్టర్ ఇంతియాజ్ కు ఊరట... వారెంట్‌ను రీకాల్ చేసిన హైకోర్టు

సారాంశం

 కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్ కు ఊరట లభించింది. ఆయనపై జారీ చేసిన వారెంట్ ను హైకోర్టు రీకాల్ చేసింది. 

విజయవాడ: తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కు ఇటీవల హైకోర్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా నిన్న(మంగళవారం) హైకోర్టుకు హాజరయ్యారు మాజీ కలెక్టర్ ఇంతియాజ్. సమాచార లోపంతోనే గతంలో కోర్టుకు హాజరుకాలేకపోయానని... దయచేసి వారెంట్ ను రీకాల్ చేయాలని కోర్టును కోరారు ఇంతియాజ్ తరపు న్యాయవాది. దీంతో గతంలో ఇంతియాజ్ పై జారీచేసిన వారెంట్‌ను రీకాల్ చేసింది హైకోర్టు.

PREV
click me!

Recommended Stories

Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!