పోలవరం పనులపై తీవ్ర అసంతృప్తి

Published : Oct 09, 2017, 08:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
పోలవరం పనులపై తీవ్ర అసంతృప్తి

సారాంశం

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట పనుల పురోగతిపై చంద్రబాబు వర్చువల్ రివ్యూ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోజురోజుకూ పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. పూర్తిస్థాయిలో యంత్రాలు వచ్చినా లక్ష్యం మేరకు ఎందుకు పనులు జరగడం లేదని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను నిలదీసారు.

అనుకున్న స్థాయిలో ఫలితాలు రానప్పుడు సమీక్షలు నిర్వహించి ఉపయోగం ఏంటంటూ ధ్వజమెత్తారు. పనిలో పనిగా అధికారుల పనితీరుపైన కూడా  మండిపడ్దారు. నిర్మాణ సంస్థలకు ఎదురవుతున్న ఆర్ధికపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు.  

PREV
click me!

Recommended Stories

సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda
JC Prabhakar Reddy Challenges Peddareddy: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ | Asianet Telugu