చంద్రబాబుకు షాక్: పార్టీ వీడనున్న కృష్ణాజిల్లా కీలక నేత

By Nagaraju penumalaFirst Published Feb 22, 2019, 8:13 PM IST
Highlights

నెలరోజులుగా పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన ఇక తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 
 

అమరావతి: గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో వలసల పర్వం ఊపందుకుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

నెలరోజులుగా పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన ఇక తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

టీడీపీతోపాటు ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పై నాగూల్ మీరా ఆశలు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నాగూల్ మీరా లేదా ఆయన వర్గీయులు ఎవరో ఒకరు పోటీ చేస్తారని భావించారు. 

అయితే అనూహ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కుమార్తెకు టికెట్ ఖరారు చేశారని తెలియడంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. 2014లో తాను పోటీ చెయ్యాలని భావించానని బీజేపీతో పొత్తు నేపథ్యంలో తాను టికెట్ వదులు కోవాల్సి వచ్చిందన్నారు. 

గతంలో  పొత్తు కోసం టికెట్ వదులుకున్నానని, అయితే ఈ సారి అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తుంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. తనను కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి తనను చంద్రబాబు నాచయుడు నిర్లక్ష్యం చేశారని నాగూల్ మీరా ఆరోపిస్తున్నారు. 

click me!