మొహర్రం వేడుకల్లో అపశృతి... భగభగ మండుతున్న మంటల్లో దూకి వ్యక్తి మృతి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 20, 2021, 09:31 AM IST
మొహర్రం వేడుకల్లో అపశృతి... భగభగ మండుతున్న మంటల్లో దూకి వ్యక్తి మృతి (వీడియో)

సారాంశం

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి హటాత్తుగా పీర్ల గుండంలో దూకి మృతిచెందిన విషాద ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కర్నూల్: ఎంతో భక్తిశ్రద్దలతో హిందూ-ముస్లీంలు కలిసి జరుపుకునే పండగ మొహర్రం. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొహర్రం వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే భగభగ మండుతున్న పీర్ల గుండంలో దూకి ఓ వ్యక్తి కాలిబూడిదైన దుర్ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా అవుకు రూరల్ మండలంలోని సుంకేసుల గ్రామంలో గురువారం రాత్రి మొహర్రం ఉత్సవాలు జరిగాయి. ఈ మొహర్రం వేడుకలను తిలకించేందుకు కాశీపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (55) అనే వ్యక్తి సుంకేసులకు వచ్చాడు. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు కానీ స్థానికులు అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా అతడు దట్టంగా మండుతున్న పీర్ల గుండంలో దూకాడు. ో

వీడియో

అక్కడే వున్నవారు అతడిని కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. అతడు మంటల్లోకి దూకగానే శరీరమంతా మంటలు అంటుకున్నాయి. అక్కడున్నవారు వెంటనే స్పందించి బయటకు తీసేలోపే పూర్తిగా  కాలిపోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగి కాలిపోయిన స్థితిలోవున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu