కాకినాడ జెడ్పీ సమావేశంలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. గట్టిగా మాట్లాడుతున్నారేమిటని మంత్రిని అడిగిన చంటిబాబు..

By Sumanth KanukulaFirst Published Aug 16, 2022, 1:34 PM IST
Highlights

కాకినాడ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా సాగిన సంభాషణ వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. 

కాకినాడ జెడ్పీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ వర్గాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జెడ్పీటీసీలకు ఛాంబర్లు కేటాయించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు.. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ‌ను కోరారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ‌.. పంచాయితీరాజ్ చట్టం ప్రకారం తాము పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఉండి ఇలా మాట్లాడటం ఏమిటని జ్యోతుల చంటిబాబును ప్రశ్నించారు. అయితే మంత్రి మాటలపై స్పందించిన చంటిబాబు.. గట్టిగా మాట్లాడుతున్నారేమిటని అడిగారు. అయితే ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా సాగిన ఈ సంభాషణ వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. 

ఇక, ఇటీవల జ్యోతుల చంటిబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. తాము ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా? అని అన్నారు. ఏ పార్టీ లో ఎవరు శాశ్వతం...ఇప్పుడున్న వారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో? అని కామెంట్ చేశారు. 


 

click me!