మొహర్రం వేడుకల్లో విషాదం.. అగ్నిగుండంలో పడి భక్తుడు మృతి

Siva Kodati |  
Published : Aug 16, 2022, 02:22 PM IST
మొహర్రం వేడుకల్లో విషాదం.. అగ్నిగుండంలో పడి భక్తుడు మృతి

సారాంశం

సత్యసాయి ప్రశాంతి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లిలో మొహర్రం వేడుకలు జరిగాయి. అయితే నిప్పుల గుండంలో ప్రమాదవశాత్తూ పడి ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు

సత్యసాయి ప్రశాంతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లిలో మొహర్రం వేడుకలు జరిగాయి. అగ్నిగుండంలో ప్రమాదవశాత్తూ జారిపడి నర్సింహులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింహులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?