తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని.. కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు

Published : Aug 03, 2018, 10:02 AM IST
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని.. కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు

సారాంశం

వీరిద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. గిరిజకు 14 ఏళ్ల బిడ్డ ఉందనే విషయం రెడ్డెయ్యకు తెలిసింది. పైగా ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువ. దీంతో నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా.. అవసరమైతే పది లక్షలు ఇస్తానని చెప్పడంతో ఆమె సరే అంది.

ఇంత దారుణం మరెక్కడా జరగకూడదు. ఓ వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే.. ఆమె కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. ఈ జుగుప్సాకరమైన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల సహాయంతో ఇప్పుడు ఆ బాలిక ఆ కామాంధుడి చెర నుంచి బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కడపకు చెందిన లక్ష్మీనారాయణ, గిరిజ కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాలిక ఉంది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతుంది. గిరిజ 13 ఏళ్ల కిందట గల్ఫ్‌ దేశానికి వెళ్లింది. అప్పటికి బాలిక 11 నెలల పాప. బిడ్డను తన అత్తగారి వద్ద వదిలి వెళ్లిపోయింది. లక్ష్మినారాయణ మాత్రం బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ కడపలోనే ఉన్నాడు.

 ఈ నేపథ్యంలో గిరిజకు కువైట్‌లో సుండుపల్లెకు చెందిన రెడ్డెయ్యతో పరిచయం ఏర్పడింది. అతనికి ఇంకా వివాహం కాలేదు. వీరిద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. గిరిజకు 14 ఏళ్ల బిడ్డ ఉందనే విషయం రెడ్డెయ్యకు తెలిసింది. పైగా ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువ. దీంతో నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా.. అవసరమైతే పది లక్షలు ఇస్తానని చెప్పడంతో ఆమె సరే అంది.

 రెణ్నెళ్ల నెలల కిందట రెడ్డెయ్య, గిరిజ ఇద్దరు కువైట్‌ నుంచి కడపకు వచ్చారు. అప్పటి నుంచి తల్లి రెడ్డెయ్యను పెళ్లి చేసుకోమని బిడ్డను వేధింపులకు గురి చేస్తోంది. పెళ్లికి ససేమిరా అనడంతో తల్లి చితకబాదింది. దీంతో ఒంటిపై గాయాలయ్యాయి. ఎట్టకేలకు జులై 29వ తేదీ బాలికను సుండుపల్లెకు తీసుకెళ్లి అక్కడ ఇంట్లో నిర్బంధించి బలవంతంగా రెడ్డెయ్య పెళ్లి చేసుకున్నాడు. తల్లి దగ్గరుండీ ఈ వివాహం చేసింది. 

ఈ విషయం  డీఎస్పీ వాసుదేవన్‌కు  ఎవరో ఫోన్‌ చేసి చెప్పడంతో ఆయన  సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. బాలిక తల్లిదండ్రులను, రెడ్డెయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu