నాలుగు నెలల పసికందుకు గొంతునులిమి చంపిన మేనమామ...

Published : Sep 30, 2021, 09:41 AM IST
నాలుగు నెలల పసికందుకు గొంతునులిమి చంపిన మేనమామ...

సారాంశం

ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. లోకం తెలియని ఆ పసికందుకు కర్కశంగా గొంతు నులిచి చంపేశాడు. 

ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడి గట్టాడా? లేదా స్థల వివాదాలు కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu