చంద్రబాబుపై బాంబు విసిరేందుకు వచ్చాడని.. టూరిజం ఉద్యోగిపై టీడీపీ కార్యకర్తల దాడి...

By AN TeluguFirst Published Oct 30, 2021, 10:53 AM IST
Highlights

బాధితుడిని టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి మోహన్‌గా గుర్తించారు. Nara Chandrababu Naiduపై బాంబు విసిరేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడిపై అనుమానం వ్యక్తం చేసిన.. టీడీపీ కార్యకర్తలు అతన్ని కొట్టి గాయపరిచారు. 

తిరుపతి : రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారానికి ఓ అమాయకుడు బలయ్యాడు. శుక్రవారం కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో 58 ఏళ్ల వ్యక్తిని తెలుగుదేశం పార్టీ (టిడిపి) కార్యకర్తలు కొట్టారు. 

బాధితుడిని టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి మోహన్‌గా గుర్తించారు. Nara Chandrababu Naiduపై బాంబు విసిరేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడిపై అనుమానం వ్యక్తం చేసిన.. టీడీపీ కార్యకర్తలు అతన్ని కొట్టి గాయపరిచారు. 

తను కుప్పం వస్తే తన కారుపై బాంబు వేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు బెదిరిస్తున్నారని టీడీపీ అధినేత ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. బాధితుడు తన బ్యాగ్‌లో చేయి పెట్టి సెల్ ఫోన్ బయటికి తీసేందుకు ప్రయత్నించాడు. ఫోన్ తో చంద్రబాబు ఫొటో తీసుకుందామని అతని ఉద్దేశం. అయితే అది hurl a bomb అని అనుమానించిన కార్యకర్తలు ఈ దారుణానికి తెగబడ్డారు. 

సమాచారం ప్రకారం, టీడీపీ కార్యకర్తల దాడికి గురై, సంఘ వ్యతిరేక వ్యక్తిగా అనుమానించబడిన టూరిజం ఉద్యోగి, నిజానికి చంద్రబాబుతో తన మనోవేదనను పంచుకోవాలని, ఆయనను కలవడానికి Kuppam వచ్చాడు. మోహన్ తన ఫిర్యాదులను సమర్పించడానికి టీడీపీ చీఫ్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాడు. దీనికోసం కుప్పంలోని టీడీపీ నాయకుడిని సహాయం కోరినట్లు సమాచారం.

అయితే, నాయుడు బహిరంగ సభకు హాజరైన మోహన్‌ను అధికార పార్టీకి చెందిన anti-social elementగా అనుమానించడంతో టీడీపీ కార్యకర్తలు కొట్టారు. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. పలమనేరు డీఎస్పీ సి.ఎం. సమావేశంలో ఉన్న గంగయ్య, సీఐ సాదిక్‌ అలీ, బృందం వేగంగా స్పందించి టూరిజం ఉద్యోగిని దాడి నుంచి రక్షించారని, లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉండేదన్నారు.

అలా అయితే క్షమాపణ చెబుతా: జగన్‌కి బాబు సవాల్, కుప్పం సభలో అలజడి

“58 ఏళ్ల వ్యక్తి చంద్రబాబు నాయుడుపై విసిరేందుకు తన బ్యాగ్‌లోంచి బాంబును తీయడానికి ప్రయత్నిస్తున్నాడని జనంలో ఎవరో అరిచారు. ఇది విన్న ఇతర వ్యక్తులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. మేము వెంటనే స్పందించి దాడి నుండి వ్యక్తిని రక్షించాం. చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించాం. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు, ”అని సాదిక్ అలీ తెలిపారు.

మరోవైపు బాంబు పుకార్లను ప్రసారం చేసి టూరిజం ఉద్యోగిని కొట్టిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పుకార్లు వ్యాప్తి చేయడం, అమాయకులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కుప్పంలో చంద్రబాబు పర్యటన..
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. శుక్రవారం నాడు Kuppamలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. వైసీపీ నేతలు, తమ పార్టీ నేతలు మాట్లాడిన  మాటలను ప్రజల ముందు పెడతామన్నారు. ఒకవేళ తాము తప్పు చేసి ఉంటే ప్రజలకు క్షమాపణ చెబుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ విషయమై తాను ఎక్కడికైనా వస్తానని చెప్పారు. తన మంచితనాన్నే ఇంతవరకు చూశారన్నారు.

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై  రాష్ట్రపతికి వివరించినట్టుగా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ  దాడికి దిగిందన్నారు.తనపై బాంబులు వేస్తానని  ప్రకటించారన్నారు. బాంబులకు తాను భయపడనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

click me!