తిరుమల ఆలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరుగులు తీసిన భక్తులు

Siva Kodati |  
Published : Jun 19, 2022, 06:41 PM ISTUpdated : Jun 19, 2022, 06:48 PM IST
తిరుమల ఆలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరుగులు తీసిన భక్తులు

సారాంశం

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. 

నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల ఆలయం వద్ద ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దక్షిణమాడ వీధిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే బాధితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఘటనతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?