తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రియురాలి తల్లిదండ్రులపై దాడి..

Published : Jul 17, 2023, 01:45 PM IST
తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రియురాలి తల్లిదండ్రులపై దాడి..

సారాంశం

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని డక్కిలి మండలంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని డక్కిలి మండలంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదని.. ప్రియురాలి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. గిరి అనే వ్యక్తి డక్కిలి మండల కేంద్రంలో తన ప్రియురాలు తల్లిదండ్రులు తులసి జగదీష్, సుజాతలపై దాడికి దిగాడు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే జగదీష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు  చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం గిరి పరారీలో ఉన్నాడు. ఇక, గిరి స్వస్థలం శ్రీకాళహస్తి మండలంలోని వాగివేడుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్