దేశంలోనే తొలి ‘రోబో’ రెస్టారెంటు

Published : Dec 15, 2017, 07:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
దేశంలోనే తొలి ‘రోబో’ రెస్టారెంటు

సారాంశం

తమిళనాడులో రోబో రెస్టారెంటు ప్రారంభమైంది.

తమిళనాడులో రోబో రెస్టారెంటు ప్రారంభమైంది. చెన్నై ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో రోబో థీమ్ రెస్టారెంటును ఇద్దరు యువకులు ప్రారంభించారు. ఇదే రెస్టారెంటు చాలా కాలంగా నడుస్తున్నా రోబో థీమ్ తో సరికొత్తగా ప్రారంభించారు. రెస్టారెంటుకు వచ్చిన అతిధులు ఇచ్చిన ఆర్డర్ రెడీ అవ్వగానే సదరు ఆర్డర్ ను రోబోలే సర్వ్ చేస్తున్నాయ్. ఈ తరహా రోబో సర్వర్లు ప్రస్తుతం జపాన్, అమెరికా, యూరోప్ లోని కొన్ని దేశాలతో పాటు బంగ్లాదేశ్ లో ఉన్నాయి. కాగా మహాబలిపురం రోడ్డులో స్టార్ట్ చేసిన రోబో రెస్టారెంటే దేశంలో తొలి రెస్టారెంట్ అనే చెప్పాలి. వెంకటేష్ రాజేంద్రన్, కార్తీక్ కన్నన్ అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఈ రెస్టారెంటును ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Fuel Issue:వాళ్ళ కాన్వాయిలకు పెట్రోల్ఆపితే మాకష్టాలుతెలుస్తాయి..వాహనదారులు ఫైర్| Asianet News Telugu
Fuel Issue:పెట్రోల్ కోసంవాహనదారుల మధ్యఘర్షణలు… బంక్‌లవద్ద ఉద్రిక్త పరిస్థితులు!| Asianet News Telugu