బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో వచ్చే మూడు రోజుల వ‌ర్షాలు : ఐఎండీ

Published : Oct 23, 2022, 04:26 PM IST
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో వచ్చే మూడు రోజుల వ‌ర్షాలు : ఐఎండీ

సారాంశం

Weather alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్ప‌డింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తాయనీ, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.  

Rain Alert: నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి ఉపసంహరించుకుంటున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం 8:30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వ్యాపించింది. ఇది పోర్ట్ బ్లెయిర్ కు వాయువ్యంగా 640 కిలో మీట‌ర్ల దూరంలో, సాగర్ ద్వీపానికి దక్షిణాన 670 కిలో మీట‌ర్ల దూరంలో, బరిసాల్ (బంగ్లాదేశ్) కు దక్షిణ నైరుతి దిశలో 820 కిలో మీట‌ర్ల దూరంలో దూరంలో కేంద్రీకృతమై ఉంది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్ప‌డింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తాయనీ, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 12 గంటల్లో బలమైన గాలులు వాయువ్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా మారి అక్టోబర్ 25 ఉదయం టింకోనా ద్వీపం, శాండ్విప్ మధ్య బారిసాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తాయని వెల్లడించింది.

అప్ర‌మ‌త్త‌మైన బెంగాల్.. 

 బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ఆదివారం సాయంత్రం నాటికి తుఫానుగా మారడంతో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షం, గాలులు తాకే అవకాశం ఉంది. ఇది ఆదివారం సాయంత్రం నాటికి కాళీ పూజ, దీపావళి పండుగలను ప్ర‌భావితం చేసే అవ‌కాశ‌ముంది. ఆదివారం ఉదయం సాగర్ ద్వీపానికి దక్షిణంగా 700 కిలో మీట‌ర్ల దూరంలో ఉండి వాయువ్య దిశగా కదులుతున్న అల్ప‌పీడ‌న వ్యవస్థ ఈశాన్య దిశగా తిరిగి టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య  సోమ‌వారం తెల్ల‌వారుజామున తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. 

దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాల కోస్తా జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్‌లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోల్‌కతా, హౌరా, హుగ్లీలలో సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక బులెటిన్‌లో పేర్కొంది. కాగా, ఈ తుఫానుకు సిత్రాంగ్ పేరును థాయిలాండ్ ప్ర‌భుత్వం పెట్టింది. 

ఈశాన్య రాష్ట్రాలు అలర్ట్..

త్రిపుర, ఈశాన్య ప్రాంతంలోని వివిధ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాను పరిస్థితులను ఎదుర్కోవటానికి ముందస్తు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా, విపత్తు నిర్వహణ అధికారులను కోరాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఇదిలావుండగా, జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (NCMC) శుక్రవారం కేంద్ర, రాష్ట్ర సంస్థల సన్నద్ధతను సమీక్షించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) తన బృందాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచింది. నౌకలు, విమానాలతో పాటు ఆర్మీ-నేవీ రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu