వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై నలుగురు నాలుగు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అధికార టిడిపి వాళ్లైతే జగన్ పాదయాత్రపై ఎన్నడూ లేనంతగా దుమ్మెత్తిపోస్తున్నారు. వామపక్షాలు ఏదో పాదయాత్ర చేస్తున్నాడులే అన్నట్లు మాట్లాడారు. బిజెపి అయితే పాదయాత్ర వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు.
ఎవరి వ్యాఖ్యలు, కామెంట్లు ఎలాగున్నా దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం జగన్ బంగారమంటున్నారు. జ్వరమున్నా పాదయాత్రను ఆపటం లేదని బాధపడుతున్నారు. పాదయాత్ర గురించి ఆమె మాటల్లోనే చూడండి ఏమంటున్నారో...