
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ లగేజీ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. వ్యాన్ నీటిలో మునిగిపోయింది. వ్యాన్ లో డ్రైవర్, క్లీనర్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామం సమీపంలో జరిగింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోని నీటిని తోడిస్తున్నారు. బావిలోని నీటిని తోడేసిన తర్వాత వ్యాన్ లో ఎంత మంది ఉన్నారనే స్పష్టత వస్తుంది. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదుపు తప్పి వ్యాన్ బావిలోకి దూసుకెళ్లింది.
వివరాలు అందాల్సి ఉంది.