రెండు నెలల క్రితం బిడ్డకు జన్మ, అంతలోనే పొలంలో శవమై తేలిన లేడీ కానిస్టేబుల్

By Siva KodatiFirst Published Aug 8, 2021, 5:38 PM IST
Highlights

తిరుపతిలో దారుణం  జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.  రెండు నెలల క్రితం ఆమె పండంటి పాపకు జన్మనిచ్చారు
 

తిరుపతిలో దారుణం  జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సుకన్య రెండు నెలల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చారు. అప్పట్నుంచి మెటర్నిటీ సెలవులో వున్నారు సుకన్య. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇంటి పక్కనే వున్న పొలం దగ్గర ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!