చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ: టీడీపీలోకే...

Published : Feb 12, 2019, 03:25 PM ISTUpdated : Feb 12, 2019, 03:28 PM IST
చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ: టీడీపీలోకే...

సారాంశం

మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవలనే కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిషోర్ చంద్రదేవ్  టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవలనే కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిషోర్ చంద్రదేవ్  టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్  కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2011లో కేంద్రంలో  అధికారంలో ఉన్న యూపీఏ  ప్రభుత్వంలో  కిషోర్ చంద్రదేవ్ కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా కూడ పనిచేశారు.

న్యూఢిల్లీలో చంద్రబాబుతో కిషోర్ చంద్రదేవ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

 

సంబంధిత వార్తలు

పవన్‌ కళ్యాణ్ ఎఫెక్ట్: సీపీఎంలోకి కిషోర్ చంద్రదేవ్?

కాంగ్రెస్‌కు కిషోర్ చంద్రదేవ్ రాజీనామా: సైకిలెక్కుతారా?

PREV
click me!

Recommended Stories

నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu
Gade Sai Krishna Case: నేనెలాంటి సెటిల్మెంట్లు చేయలేదు | Janasena leader Ammisetty Vasu | Asianet