మహారాష్ట్రలో చిన్నారుల కిడ్నాప్.. ఏపీలో విక్రయం: కిడ్నాప్ ముఠా గుట్టురట్టు , బెజవాడ మహిళ అరెస్ట్

Siva Kodati |  
Published : Mar 08, 2023, 03:09 PM ISTUpdated : Mar 08, 2023, 03:11 PM IST
మహారాష్ట్రలో చిన్నారుల కిడ్నాప్.. ఏపీలో విక్రయం: కిడ్నాప్ ముఠా గుట్టురట్టు , బెజవాడ మహిళ అరెస్ట్

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్, విక్రయం వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో 8 మంది పిల్లలను కిడ్నాప్ చేసిన ముఠా.. వారిని ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట, జగ్గయ్యపేటలలో విక్రయించారు

ఎన్టీఆర్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్, విక్రయం వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కిడ్నాప్ చేసిన చిన్నారులను ఓ ముఠా ఎన్టీఆర్ జిల్లాలో విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో 8 మంది పిల్లలను కిడ్నాప్ చేసిన ముఠా.. వారిని ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట, జగ్గయ్యపేటలలో విక్రయించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన మహారాష్ట్ర పోలీసులు.. ఏపీకి వచ్చి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విస్సన్నపేటలో ఒకరిని, జగ్గయ్యపేటలో నలుగురు చిన్నారులను విక్రయించినట్లుగా తేల్చారు. మరో ముగ్గురి వివరాలు తెలియరాలేదు. ఈ మొత్తం రాకెట్‌లో విజయవాడకు చెందిన శ్రావణిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. మగపిల్లలే టార్గెట్‌గా ఈ ముఠా కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీ స్వస్థలంలోనే ఆఫీస్ సెటప్.. ఖర్చులు ప్రభుత్వానివే, లక్షలకు లక్షల బెనిఫిట్స్ పొందండిలా..
RK Roja: జగనన్న మళ్లీ వస్తేనే మంచిరోజులు.. బాబుకి ఆ ధైర్యం లేదు | Asianet News Telugu