కేశినేని వర్సెస్ పీవీపీ: నీ ప్రియుడు ఎవరు రాజా అంటూ పీవీపీ సెటైర్లు

By Siva KodatiFirst Published Jul 19, 2019, 9:03 AM IST
Highlights

కేశినేని నాని, పీవీపీల ట్వీట్టర్ వార్ తారాస్థాయికి చేరింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. 

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ నేత పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. తాత డబ్బులతో సోకు చేసే వాళ్లతో దేశానికి నష్టం లేదంటూ కేశినేని మరోసారి ఫైరయ్యారు.

తాత డబ్బు తో సోకు చేసే వాళ్ళతో దేశానికి నష్టం లేదు 
బ్యాంకుల డబ్బు తో సోకు చేసే వాళ్ళతోనే దేశానికి నష్టం
నిస్సానిలవల్ల దేశానికి వచ్చిన ప్రమాదం లేదుదుష్ట మేధావుల వల్ల మాత్రం దేశానికి పెను ప్రమాదం
లాగు రంగు వల్ల సమాజానికి ఇబ్బంది లేదుమనసు, మధి మలినం కాకుండా వుంటే సమాజానికి మంచిది

— Kesineni Nani (@kesineni_nani)

అక్కడితో ఆగకుండా బ్యాంకుల డబ్బుతో సోకు చేసే వాళ్లతోనే దేశానికి నష్టమని.. నిషానీల వల్ల దేశానికి ఎలాంటి నష్టం లేదని.. మేధావుల వల్ల మాత్రం దేశానికి నష్టమంటూ నాని ఘాటుగా ట్వీట్ చేశారు.

దీనికి అంతే  స్థాయలో కౌంటరిచ్చారు పొట్లూరి వరప్రసాద్. ‘‘కలవరమాయే మదిలో’’ అని క్యాప్షన్ పెట్టి నీ ప్రియుడు ఎవరు రాజా..? చంద్రబాబా... ఇంకొకరా, కేశినేని.. ఏమిటీ రంకు.. బొంకు అంటూ ధ్వజమెత్తారు. ముందు నీది పసుపు నిక్కరో.. ఖాకీ నిక్కరో తేల్చుకోవయ్యా సామీ అంటూ సెటైర్లు వేశారు. 
 

తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్ర గాడిని కాదు. వేల కోట్లతో వ్యాపారాలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించాము. వేల కోట్లు బ్యాంకులకు ఎగొట్టడమెలాగో మీ "గురువు"గారిని అడిగి చెపితే మేము ఆ కొత్త బిజినెస్ నేర్చుకుంటాము..

— PVP (@PrasadVPotluri)

కలవరమాయే మదిలో !!! నా మదిలో.. కన్నుల్లో మనస్సే ప్రేమ మందిరమాయే.. ఆ ప్రియుడు ఎవరు రాజా ??? చంద్రబాబా.. ఇంకొకరా? కలికాలం సుమీ.. ఏమిటి రంకు.. బొంకు??

— PVP (@PrasadVPotluri)
click me!