175ఏళ్ల ఆచారాన్ని గౌరవిస్తూ...ఆ భూమిని కాపాడండి: గ్రామస్తుల వేడుకోలు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 20, 2020, 11:57 AM IST
175ఏళ్ల ఆచారాన్ని గౌరవిస్తూ...ఆ భూమిని కాపాడండి: గ్రామస్తుల వేడుకోలు (వీడియో)

సారాంశం

దాదాపు 175 సంవత్సరాల క్రితం నుండి దేవర ఇల్లు గుడి పూజిస్తున్నామని... ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన భూమిని దేవుని మాన్యం గా గుర్తించి కాపాడాలంటూ పాపన్న గారిపల్లి గ్రామస్తులు ప్రభుత్వాన్ని, దేవాదాయ అధికారులకు కోరుతున్నారు. 

కడప జిల్లా సంబేపల్లి మండలం పాపన్న గారిపల్లి గ్రామస్తులు తమ ఇష్టదైవానికి సంబంధించిన భూమిని కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. దాదాపు 175 సంవత్సరాల క్రితం నుండి దేవర ఇల్లు గుడి పూజిస్తున్నామని... ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన భూమిని దేవుని మాన్యం గా గుర్తించి కాపాడాలంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని, దేవాదాయ అధికారులకు కోరుతున్నారు. 

పాపన్నగారి పల్లిగ్రామం సర్వేనెంబర్ 6ఆ లో 5 ఎకరాల 19 సెంట్లు భూమి నందు దేవర్ ఇంటికి సంబంధించిన ఇద్దరు పూజారులు, ఆరు దేవర ఎద్దుల సమాధులు వున్నాయి. అయితే వీటిని మూడు తరాల నుంచి ఈ సమాధులకు గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల ఈ భూమిని ఇటీవల అధికారుల అండబలం,  రాజకీయ పలుకుబడితో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వీడియో

"

తమ ఆచారాలను గౌరవించి నాలుగు గ్రామాలను కాపాడుతూ వస్తున్నటువంటి దైవానికి సంబంధించిన భూమిని కాపాడాలని వేడుకున్నారు. ప్రభుత్వాధికారులు కలుగచేసుకుని తాము పూజించేటువంటి జీవ సమాధులు కలిగిన ఈ భూమిని దేవుని మాన్యం గానే ఇవ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

AP & Telangana Weather:తెలుగు రాష్ట్రాల్లో పగలు మండే ఎండలు రాత్రి భారీ వర్షాలు | Asianet News Telugu
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?