కాకినాడ జేఎన్‌టీయూలో ఎంబీఏ విద్యార్ధినికి వేధింపులు: కాంట్రాక్టు లెక్చరర్‌పై వేటు

Published : Dec 01, 2022, 09:27 PM IST
కాకినాడ జేఎన్‌టీయూలో ఎంబీఏ విద్యార్ధినికి వేధింపులు: కాంట్రాక్టు లెక్చరర్‌పై వేటు

సారాంశం

కాకినాడ జేఎన్‌టీయూలో  ఎంబీఏ సెకండియర్ చదువుతున్న విద్యార్ధినిపై  కాంట్రాక్టు లెక్చరర్  వేధింపులకు పాల్పడ్డాడు. ఈ  వేధింపులపై బబాధితురాలు  ఫిర్యాదు  చేసింది. లెక్చరర్ పై యూనివర్శిటీ అధికారులు వేటేశారు. 

విజయవాడ: కాకినాడ జెఎన్‌టీయూలో  ఎంబీఏ సెకండియర్  చదువుతున్న విద్యార్ధినిపై కాంట్రాక్ట్  లెక్చరర్  కుమార్  వేధింపులకు పాల్పడ్డాడు.ఈ  వేధింపులపై  బాధిత విద్యార్ధిని  ఫిర్యాదు  చేసింది.ఈ  ఫిర్యాదు  ఆధారంగా  కాంట్రాక్టు లెక్చరర్  కుమార్ ను విధుల నుండి తప్పించారు.  ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు యూనివర్శిటీ అధికారులు.

ఎంబీఏ రెండో  సంవత్సరం చదువుతున్న విద్యార్ధినిని   కాంట్రాక్టు లెక్చరర్  వేధింపులకు గురి చేస్తున్నారని  యూనివర్శిటీ వీసీకి  బాధితురాలు ఫిర్యాదు  చేసింది.ఈ వేధింపులకు సంబంధించి  బాధితురాలు కొన్ని ఆధారాలను  కూడా  పంపింది.ఈ  విషయమై  విచారణ నిర్వహించిన  యూనివర్శిటీ అధికారులు కాంట్రాక్టు లెక్చరర్  కుమార్ ను డిస్మిస్  చేశారు. అంతేకాదు  బాధితురాలి నుండి  ఈ విషయమై  అదికారులు మరింత సమాచారం తెలుసుకోనున్నారు.

గతంలో  కాకినాడ జేఎన్‌టీయూ లో  ఎంటెక్  ఫస్టియర్ విద్యార్ధినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై  యూనివర్శిటీ అధికారులు  కమిటీని ఏర్పాటు చేశారు.   లాబోరేటరీలో  అసిస్టెంట్  ప్రొఫెసర్  తనను అసభ్యంగా తాకారని  ఆమె ఆరోపించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu
Minister Srinivas Varma Speech at Amarajeevi Jaladhara Scheme Foundation Stone | Asianet News Telugu