అనంతపురం ఉల్లికల్లు ఇసుకరీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా: ఉద్రిక్తత, అరెస్టు

Published : Feb 09, 2023, 01:24 PM ISTUpdated : Feb 09, 2023, 02:02 PM IST
అనంతపురం ఉల్లికల్లు ఇసుకరీచ్ వద్ద జేసీ  ప్రభాకర్ రెడ్డి ధర్నా: ఉద్రిక్తత,  అరెస్టు

సారాంశం

అనంతపురం జిల్లాలోని  ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఇవాళ ఆందోళనకు దిగారు.   

అనంతపురం: జిల్లాలోని  ఉల్లికల్లు ఇసుక రీచ్  వద్ద  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి  గురువారం నాడు  ఆందోళనకు దిగారు . అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు.  రైతులతో  కలిసి    జేసీ ప్రభాకర్ రెడ్డి   ధర్నా నిర్వహించారు.  అయితే  ధర్నాకు  అనుమతి లేదని  ఆయనను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

అనుమతి లేకుండా  ఉల్లికల్లు ఇసుక రీచ్ నుండి  ఇసుకను తరలిస్తున్నవారిపై కేసు నమోదు చేయాలని   జేసీ ప్రభాకర్ రెడ్డి  డిమాండ్  చేశారు.  ఉల్లికల్లు  ఇసుక రీచ్ వద్ద  రోడ్డుపై  బైఠాయించిన   జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఉల్లికల్లు   ఇసుక రీచ్ కు అనుమతి  ఉంటే  అనుమతి పత్రాలు చూపాలని  జేసీ ప్రభాకర్ రెడ్డి  డిమాండ్  చేశారు.  ఈ ఇసుక రీచ్   కి అనుమతి ఉందని  మైన్స్  అధికారులు, తహసీల్దార్   పత్రాలుచూపాలని ఆయన కోరారు. 

ధర్నాకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేసి  పెద్దపప్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో  పోలీసులతో  జేసీ ప్రభాకర్ రెడ్డి  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఆధునిక అగ్నిమాప‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu Naidu: ఏపీకి 252.93 కోట్లతో కొన్న ఆధునిక అగ్నిమాపక వాహనాలు| Asianet News Telugu