పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

Published : Aug 13, 2019, 02:15 PM ISTUpdated : Aug 13, 2019, 02:36 PM IST
పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 


జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్... మంగళవారం పోలీసులకు లొంగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించారు. ఈ క్రమంలో ఏకంగా ఆయనే వచ్చి రాజోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. 

ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎస్సై...ఏక వచనంలో మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ... ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఎమ్మెల్యే రాపాకపై పోలీస్ కేసు... స్పందించిన డీఐజీ

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
ఏపీలో నిప్పుల కుంపటి.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్