రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన శ్రేణుల దాడి.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Oct 15, 2022, 04:58 PM ISTUpdated : Oct 15, 2022, 05:05 PM IST
రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన శ్రేణుల దాడి.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత

సారాంశం

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది.

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. మంత్రులు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. దీనిపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని.. జనసేన కార్యకర్తల దాడిలో మా వాళ్లకు దెబ్బలు తగిలాయన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం