వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసులో జ‌గ‌న్ బండారం వెలుగులోకి వ‌స్తుంది - ఏపీ బీజేపీ ఉపాధ్య‌క్షుడు ఆదినారాయ‌ణ రెడ్డి

By team teluguFirst Published Sep 29, 2022, 3:24 PM IST
Highlights

ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడింట్ ఆదినారాయ‌ణ రెడ్డి ఏపీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైస్ వివేకా రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్ మోహన్ రెడ్డి పేరు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆరోపించారు. 

వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హారం త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆదినారాయ‌ణ రెడ్డి తెలిపారు. వైసీపీ ఏపీ స్టేట్ సెక్ర‌ట‌రీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కింగ్ పిన్ సుప్రీంకోర్టు పేర్కొంద‌ని అన్నారు. బీజేపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాపోరు కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న వైఎస్ఆర్ జిల్లా ఎర్ర‌గుంట్ల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

ఇసుక అక్రమ రవాణా పై గొడవ.. రెండు ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు దుర్మరణం.. ఎక్కడంటే?

ఈ సంద‌ర్భంగా ఆదినారాయ‌ణ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న సోద‌రి అయిన ష‌ర్మిల‌, సునీత‌ను బాధకు గురి చేసి ఏం సాధించార‌ని తెలిపారు. సీఎంకు ఎవ‌రు ఎదురు నిలిచినా.. వారిపై కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కేంద్ర ప్ర‌భుత్వం చెక్ పెడుతుంద‌ని చెప్పారు. ఆడ ప‌డుచుల‌కు ఏపీలో భ‌ద్ర‌త లేద‌ని, పాల‌న అంటే ఇదేనా అని ప్ర‌శ్నించారు. నిజాల‌ను ఎండ‌గ‌ట్టేందుకే తాము మీటింగ్ లు పెట్టామ‌ని చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్.. సోనియాకి క్షమాపణలు

ప‌త్రిక‌ల్లో నీచంగా మాట్లాడుతున్నార‌ని, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యే బ‌రితెగించార‌ని, ఇష్ట‌మొచ్చిన‌ట్టు చేస్తున్నార‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఢిల్లీ స్కామ్ లో కూడా ఇరుక్కున్నార‌ని ఆరోపించారు. దీంతో రెండు రాష్ట్రాల సీఎంల‌కు సంబంధం ఉంద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఉన్నాయ‌ని అన్నారు. ఇవి త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు.

click me!