డీప్ ఫేక్ టెక్నాలజీ పై జోక్యం చేసుకోండి.. : కేంద్రానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ

Published : Nov 08, 2023, 03:37 AM IST
డీప్ ఫేక్ టెక్నాలజీ పై జోక్యం చేసుకోండి.. :  కేంద్రానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ

సారాంశం

Deep Fake Technology: ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పటి నుండి, అలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వ‌ర్గాల నుంచి డిమాండ్స్ వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోకి బలయ్యారు.   

TDP MP Kinjarapu Ram Mohan Naidu: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్ల‌మెంట్ స‌భ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యక్తుల గోప్యత, హక్కులకు డీప్ ఫేక్ టెక్నాల‌జీతో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో ఆయ‌న డీప్ ఫేన్ టెక్నాలజీపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో మంచి పురోగతి ఉన్నప్పటికీ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరాన్ని టీడీపీ ఎంపీ నొక్కి చెప్పారు.

డీప్ ఫేక్ టెక్నాలజీ అత్యంత రియలిస్టిక్ వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు ప్ర‌భావ‌వంత‌మైన‌ వ్యక్తులను-ప్రజలను మోసగించేలా మార్చగల ఇతర కంటెంట్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తుందని లేఖ‌లో పేర్కొన్నారు. ఏఐ-ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల పరువు నష్టం, తప్పుడు సమాచారం, వ్యక్తిగత-వృత్తిపరమైన ప్రతిష్టలకు నష్టం వంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి ఏఐ నిపుణులు, న్యాయ నిపుణులు, నైతిక పండితులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

వివిధ రంగాల్లో డీప్ ఫేక్ టెక్నాలజీ అనుమతించదగిన ఉపయోగాలను నిర్వచించడానికి సమగ్ర నిబంధనలను ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్‌లో హానికరమైన డీప్ ఫేక్ కంటెంట్‌ను గుర్తించడం, దానిని తొలగించడం కోసం మెకానిజమ్‌లను రూపొందించడం, బాధ్యులకు జవాబుదారీతనం కల్పించడం, నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కమిటీ లక్ష్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో అనుబంధం, చట్ట అమలు సంస్థలతో సహకరించడం, డీప్ ఫేక్ సాంకేతికతలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అంశాల‌ను ప్ర‌స్తావించారు.

వ్యక్తిగత హక్కులను రక్షించడం, ఏఐ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం మధ్య సమతుల్యతను సాధించడం ప్రాముఖ్యతను రామ్మోహ‌న్ నాయుడు నొక్కిచెప్పారు. ప్రజల భద్రతకు మంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పటి నుండి, అలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వ‌ర్గాల నుంచి డిమాండ్స్ వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోకి బలైపోయారు. ఆమెకు సంబంధించి ఒక డీప్ ఫేక్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే