China-Bharat: మ్యానుఫ్యాక్చురింగ్‌ వ్యయాల్లో చైనాను తొక్కిపడేసిన భారత్‌!

Published : Jun 06, 2025, 09:54 AM IST
China India

సారాంశం

తయారీ వ్యయాల్లో చైనాను వెనక్కినెట్టి, అత్యంత ఖర్చుతో కూడిన మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారత్ ప్రథమ స్థానానికి ఎదిగింది.

మేక్ ఇన్ ఇండియా…

భారతదేశం మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఓ కీలక మైలురాయిని సాధించింది. తయారీ వ్యయాల్లో చైనాను దాటి, ప్రపంచంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న తయారీ కేంద్రంగా భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మార్పు వలన ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమానికి విశిష్ట గుర్తింపు లభించింది.

హైఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌…

గ్లోబల్ కాస్ట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో తయారీ వ్యయాలు చైనాతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. ఇది భారత్‌లో పెరిగిన వేతనాలు, ముడిసరుకుల ధరలు, శ్రమ ఖర్చులు వంటి అంశాల ప్రభావంగా భావిస్తున్నారు. అయితే, దీని వల్ల దేశంలో హైఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచ ఫ్యాక్టరీ…

వాణిజ్య, పారిశ్రామిక రంగాల విశ్లేషకులు దీన్ని ఒక కొత్త దశగా పేర్కొంటున్నారు. ఇప్పటివరకు చైనా ‘ప్రపంచ ఫ్యాక్టరీ’గా ప్రసిద్ధి గాంచింది. కానీ ఇప్పుడిప్పుడే భారత్ ఆ స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ మార్పు వెనుక ‘మేక్ ఇన్ ఇండియా’ విధానం కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ ఉత్సాహవంతమైన విధానాలు, మౌలిక సదుపాయాల పెరుగుదల, విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం వంటి అంశాలు దీనికి తోడయ్యాయి.

పలు అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు చైనాను వదిలి భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాల్లో కీలక కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రభావంతో భారతదేశం ప్రపంచ తయారీ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అరెస్ట్‌.. శ్రీకాకుళంలో ఉద్రిక్త పరిస్థితులు
సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu