రాజకీయాల్లోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Published : Apr 17, 2023, 05:55 AM ISTUpdated : Apr 18, 2023, 06:08 AM IST
రాజకీయాల్లోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సారాంశం

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీణారాయణ తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చేస్తానని వెల్లడించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని వివరించారు. అలాగే, వైజాగ్ స్టీట్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.  

హైదరాబాద్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పాలకొల్లులోని ఓ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే డా. బాబ్జి గృహం వద్ద మీడియాతో మాట్లాడారు.

తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీ టికెట్ పై పోటీ చేస్తాడనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నారని వివరించారు. 

Also Read: 30 ఏళ్ల హైదరాబాదీ బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసిన కుటుంబం

ఇదే సందర్భంలో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు. ప్రైవేటీకరణ కాకుండా తన వంతు పోరాడుతానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వావిలాల గోపాలకృష్ణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. 1980లో ఆయన పైసా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే రూ. 850 కోట్లు సమకూరుతుందని, ఇలా నాలుగు నెలలు సేకరిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవచ్చని సెలవిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఆధునిక అగ్నిమాప‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu Naidu: ఏపీకి 252.93 కోట్లతో కొన్న ఆధునిక అగ్నిమాపక వాహనాలు| Asianet News Telugu