టిడిపి ఎంఎల్ఏపై ఫిర్యాదు

Published : Jan 30, 2018, 07:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
టిడిపి ఎంఎల్ఏపై ఫిర్యాదు

సారాంశం

అధికారంపార్టీ ఎంఎల్ఏల ఆగడాలు ఎక్కువైపోతోంది.

అధికారంపార్టీ ఎంఎల్ఏల ఆగడాలు ఎక్కువైపోతోంది. భూ కబ్జా కేసులో మొన్ననే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎంఎల్ఏ బోండా ఉమ భార్య సుజాతపై కేసు నమోదైంది. ఆ విషయం అలా ఉండగానే తాజాగా అనంతపురం జిల్లాలో మరో ఎంఎల్ఏపై ఫిర్యాదు వెలుగుచూసింది. జిల్లాలోని గుంతకల్లు టిడిపి ఎంఎల్ఏ జితేంద్ర గౌడ్ పై బిసి సంఘం మైనారిటీ సెల్ ఫిర్యాదు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో నియోజకవర్గంలోని ముస్లింలను లొంగదీసుకునేందుకు ఎంఎల్ఏ ఒత్తిడి పెడుతున్నారట. తనకు లొంగనివారిపై ఎంఎల్ఏ పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు సెల్ నేతలు మండిపడ్డారు. వారి ఫిర్యాదును విచారించిన మానవ హక్కుల సంఘం ఏప్రిల్ 17వ తేదీ నాటికి సమగ్ర నివేదికను అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఎన్నికలు దగ్గర  పడేకొద్దీ ఇంకెంతమంది టిడిపి ఎంఎల్ఏలు వింత పోకడలు పోతారో చూడాల్సిందే.

 

 

PREV
click me!

Recommended Stories

తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే