జగన్ పాదయాత్రలో తేనెటీగల దాడి

Published : Jun 07, 2018, 10:44 AM IST
జగన్ పాదయాత్రలో తేనెటీగల దాడి

సారాంశం

పరుగులు తీసిన కార్యకర్తలు

జగన్ పాదయాత్రలో అనుకోని సంఘటన జరిగింది.   ఈ ఘటన కారణంగా.. కార్యకర్తలు పాదయాత్ర నుంచి పరుగులు తీశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. 

ఈ క్రమంలోఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కొద్ది సేపటి తర్వాత.. తిరిగి  పాదయాత్రను కొనసాగించారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?
TTD కీల‌క నిర్ణ‌యం.. తిరుమ‌ల‌లో ఇ-టంగ్, ఇ-నోస్ టెక్నాల‌జీ. వీటి ఉప‌యోగం ఏంటంటే.?