కృష్ణా జిల్లా : చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత, దూసుకొచ్చిన వైసీపీ కార్యకర్త .. చితకబాదిన టీడీపీ శ్రేణులు

Siva Kodati |  
Published : Apr 14, 2023, 06:07 PM IST
కృష్ణా జిల్లా : చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత,  దూసుకొచ్చిన వైసీపీ కార్యకర్త .. చితకబాదిన టీడీపీ శ్రేణులు

సారాంశం

కృష్ణాజిల్లాలో జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలోకి వైసీపీ కార్యకర్త దూసుకురావడంతో అతనిని టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. 

కృష్ణాజిల్లాలో జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు వెనుక ర్యాలీగా వస్తున్న గుంపులోకి ఓ వైసీపీ కార్యకర్త దూసుకొచ్చాడు. అనంతరం వైసీపీ జెండా ఊపుతూ హల్ చల్ చేశాడు. దీనిని గమనించిన టీడీపీ కార్యకర్తలు అతనిని అడ్డుకుని చితకబాదారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అక్కడే వున్న పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం