బిగ్ బ్రేకింగ్: ఫిరాయింపులకు హైకోర్టు నోటీసులు

First Published Mar 13, 2018, 2:00 PM IST
Highlights
  • వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది.

ఫిరాయింపుల ఎంల్ఏలకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. ఫిరాయింపులను అనర్హులుగా ప్రకటించాలని ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఏ అన్నా వెంకటరాంబాబు వేసిన కేసుపై ఈరోజు విచారణ జరిగింది. ఎంఎల్ఏలందరికీ వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

click me!