గల్ఫ్‌ ఏజెంట్ మోసం.. ఫ్లైట్‌ ఎక్కకుండానే అరెస్ట్, పోలీసుల అదుపులో 30 మంది కోనసీమ జిల్లా మహిళలు

Siva Kodati |  
Published : Aug 30, 2022, 04:25 PM IST
గల్ఫ్‌ ఏజెంట్ మోసం.. ఫ్లైట్‌ ఎక్కకుండానే అరెస్ట్, పోలీసుల అదుపులో 30 మంది కోనసీమ జిల్లా మహిళలు

సారాంశం

గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ ఏజెంట్ చేసిన మోసంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 30 మంది మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైట్ ఎక్కకుండా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నకిలీ వీసాలతో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 30 మంది మహిళలు మోసపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ అయిన బాధిత మహిళలు.. కేరళలోని ఎర్నాకుళంలో చిక్కుకుని మూడు నెలలుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మస్కట్‌లో ఉద్యోగాల పేరుతో గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తాళ్ల రాంబాబు అనే వ్యక్తి చేసిన మోసం ఆలస్యంగా వెలుగలోకి వచ్చింది. మే 5న 30 మంది మహిళలను మస్కట్‌ పంపేందుకు యత్నించాడు రాంబాబు. అయితే వాటిని నకిలీ వీసాలుగా గుర్తించిన అధికారులు ఎర్నాకులం ఎయిర్‌పోర్ట్‌లో మహిళలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో దేశంలోనే తొలి క్వాంట‌మ్ వ్యాలీ.. ఆ ప్రాంతంలో స‌రికొత్త విప్ల‌వం
Andhra pradesh: ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘ‌ట‌న‌