జగన్‌తో టీడీపీ నేత ఖలీల్ బాషా భేటీ

Published : Feb 05, 2019, 04:37 PM IST
జగన్‌తో  టీడీపీ నేత ఖలీల్ బాషా భేటీ

సారాంశం

మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్ బాషా మంగళవారం నాడు హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. ఎల్లుండి ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.  


హైదరాబాద్:  మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్ బాషా మంగళవారం నాడు హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. ఎల్లుండి ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

 కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఖలీల్ బాషా గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  మంత్రిగా కూడ పనిచేశారు.మాజీ మంత్రి అహ్మదుల్లా  టీడీపీలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో  కడప నుండి ఆయనకు పోటీచేసే అవకాశం వస్తోందో లేదో అనే అనుమానం నెలకొంది.

ఈ తరుణంలోనే ఖలీల్ బాషా టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు. మంగళవారం నాడు ఖలీల్ బాషా జగన్‌ను కలిశారు..ఎల్లుండి కడపలో జగన్ సమక్షంలో ఖలీల్ బాషా టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు మరో దెబ్బ: వైసీపీలోకి మాజీ మంత్రి

 

PREV
click me!

Recommended Stories

మార్క్ శంకర్ కోసం స్నేక్ పజిల్ కొన్న పవన్ దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | Handicrafts
ఎలక్షన్ ముందు అడిగారు వెంటనే అది చేయండి: పవన్ | Handicrafts Festival 2026 Stalls