విగ్రహ ప్రతిష్టలో ప్రసాదం తిని... 80 మందికి అస్వస్థత

Published : Jun 24, 2018, 01:22 PM IST
విగ్రహ ప్రతిష్టలో ప్రసాదం తిని... 80 మందికి అస్వస్థత

సారాంశం

విగ్రహ ప్రతిష్టలో ప్రసాదం తిని... 80 మందికి అస్వస్థత

చిత్తూరు జిల్లాలో కలుషిత ఆహారం 80 మంది ప్రాణాల మీదకు వచ్చింది. పులిచర్ల మండలం పాతపేట గ్రామపంచాయతీ పరిధిలోని పూరేడువారి పల్లెలో రెండు రోజుల నుంచి శ్రీసీతారామస్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొంటున్నారు.. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఆలయ ఆవరణలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు.

ఈ విందులో అల్పాహారాన్ని తీసుకున్న పలువురు అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం, విరేచనాలు, వాంతులతో విలవిలలాడిపోయారు.. దీంతో 108 వాహనాల్లో పీలేరు, కల్లూరు, దామలచెరువు, సుండుపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే జనం వీరంతా అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
Heavy Rain Alert : తీవ్ర వాయుగుండం దెబ్బకు ఈ మూడ్రోజుల్లో 100-120 మి.మీ వర్షం కురుస్తుందా..! ఈ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్