విగ్రహ ప్రతిష్టలో ప్రసాదం తిని... 80 మందికి అస్వస్థత

Published : Jun 24, 2018, 01:22 PM IST
విగ్రహ ప్రతిష్టలో ప్రసాదం తిని... 80 మందికి అస్వస్థత

సారాంశం

విగ్రహ ప్రతిష్టలో ప్రసాదం తిని... 80 మందికి అస్వస్థత

చిత్తూరు జిల్లాలో కలుషిత ఆహారం 80 మంది ప్రాణాల మీదకు వచ్చింది. పులిచర్ల మండలం పాతపేట గ్రామపంచాయతీ పరిధిలోని పూరేడువారి పల్లెలో రెండు రోజుల నుంచి శ్రీసీతారామస్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొంటున్నారు.. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఆలయ ఆవరణలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు.

ఈ విందులో అల్పాహారాన్ని తీసుకున్న పలువురు అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం, విరేచనాలు, వాంతులతో విలవిలలాడిపోయారు.. దీంతో 108 వాహనాల్లో పీలేరు, కల్లూరు, దామలచెరువు, సుండుపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే జనం వీరంతా అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ బెల్స్
మీ ఇంట్లో ఇలాంటి భోజనం తింటారా.? Food Commission Chairman Inspection In MJPAPBCW Residential School