టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు.. పల్నాడులో దారుణం..

Published : Feb 02, 2023, 06:40 AM IST
టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు.. పల్నాడులో దారుణం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని పల్పాడు జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది. టీడీపీ మండలాధ్యక్షుడి మీద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. 

పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.  రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపీపీ,  టిడిపి మండలాధ్యక్షుడు  బాలకోటిరెడ్డి మీద  ఈ కాల్పులు జరిగాయి. ప్రత్యర్థులు ఆయన మీద రెండు రౌండ్ల కాల్పులు  చేశారు. బాల పోటిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన  దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.  ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. 

ఈ కాల్పులతో తీవ్రంగా గాయాల పాలైన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ అరవిందబాబు బాధితుడిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations