విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుతున్న గ్యాస్ సిలిండర్లు, 20 పూరిళ్లు దగ్ధం

Siva Kodati |  
Published : Nov 12, 2021, 09:43 PM IST
విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుతున్న గ్యాస్ సిలిండర్లు, 20 పూరిళ్లు దగ్ధం

సారాంశం

విజయనగరం జిల్లాలో (vizianagaram district ) భారీ అగ్ని ప్రమాదం (fire accident) సంభవించింది. శుక్రవారం మెంటాడ మండలం (Mentada mandal) జక్కువలస (Jakkuvalasa) లోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 20 పూరిళ్లు దగ్ధమైనట్టు సమాచారం.

విజయనగరం జిల్లాలో (vizianagaram district ) భారీ అగ్ని ప్రమాదం (fire accident) సంభవించింది. శుక్రవారం మెంటాడ మండలం (Mentada mandal) జక్కువలస (Jakkuvalasa) లోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దాదాపు 20 పూరిళ్లు దగ్ధమైనట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్