Visakha steel plant fire accident: చెలరేగిన మంటలు

Published : Dec 25, 2021, 08:57 AM ISTUpdated : Dec 25, 2021, 09:05 AM IST
Visakha steel plant fire accident: చెలరేగిన మంటలు

సారాంశం

విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద యెత్తున మంటలు చెలరేగాయి. భారీగా అస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుది. బిఎఫ్ యూనిట్ లో ఉక్కు ద్రవం నేలపాలైంది. మంటలు చెలరేగుతున్నాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. Visakha steel plant fire accident వల్ల 50 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు.  ప్రాణ నష్టమేమీ సంభవించలేదు.

ఉక్కు ద్రవం కిందపడడంతో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. ముడిపదార్థాలను కరిగించి దాన్ని తరలించే సమయంలో ద్రవం జారి పడింది. మొదటి షిఫ్టు కావడంతో కార్మికులకు ఏ విధమైన ప్రమాదం కూడా సంభవించలేదు.

PREV
click me!

Recommended Stories

కర్నూలులో జగన్ మానియా.. కాన్వాయ్ వెనక పరుగులు తీసిన ఫ్యాన్స్ | YS Jagan Kurnool Tour | YSRCP
కర్నూలులో అడుగుపెట్టిన జగన్.. సీఎం సీఎం అంటూ ఘన స్వాగతం | YS Jagan KurnoolTour | Busine Virupakshi