విజయవాడ: వాంబే కాలనీలో భారీ అగ్నిప్రమాదం.. మధ్యాహ్నం 3 నుంచి మంటలు, భయాందోళనలో స్థానికులు

Siva Kodati |  
Published : Apr 19, 2022, 06:32 PM ISTUpdated : Apr 19, 2022, 06:35 PM IST
విజయవాడ: వాంబే కాలనీలో భారీ అగ్నిప్రమాదం.. మధ్యాహ్నం 3 నుంచి మంటలు, భయాందోళనలో స్థానికులు

సారాంశం

బెజవాడ వాంబే కాలనీలో రైల్వేస్‌కి కేటాయించిన స్థలంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్రదేశం కావడం.. పైగా ఎండిపోయిన గడ్డి వుండటంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. 

విజయవాడ (vijayawada) వాంబే కాలనీ (Vambay Colony) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (fire accident)  జరిగింది. రైల్వేస్‌కి (indian railways) కేటాయించిన స్థలంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. ఆ స్థలం మొత్తం పది ఎకరాలు వుంటుందని అంచనా. ఎండిపోయిన గడ్డి వుండటంతో మంటలు తీవ్రంగా చెలరేగుతున్నాయి. అయితే ఇది ఎవరైనా కావాలని పెట్టారా.. ప్రమాదవశాత్తూ జరిగిందా అన్నది తెలియరాలేదు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల  నుంచి మంటలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. ఒక్క ఫైరింజన్ మాత్రమే రావడంతో మంటలు అదుపులోకి రాలేదు. విజయవాడలో ఇవాళ ఇది రెండో అగ్నిప్రమాదం. ఉదయం ముత్యాలమ్మ అమ్మవారి గుడి వద్ద కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu