
ఇటీవల రాష్ట్రంలో కొత్తగా జిల్లాలను (ap new districts) ఏర్పాటు చేయడం...మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో 26 జిల్లాలకు 25 మంది ఇన్ఛార్జ్ మంత్రులను (district incharge ministers) నియమించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . గుడివాడ అమర్నాథ్కు పార్వతీపురం, పాడేరు జిల్లాలకు ఇన్ఛార్జీగా నియమించగా.. మిగిలిన వారందరికీ ఒక్కొక్క జిల్లాను అప్పగించారు ముఖ్యమంత్రి.
జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు వీరే:
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. అటు వీరికి మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా వున్నాయి.