విశాఖను వెంటాడుతున్న ప్రమాదాలు: హార్బర్‌లోని పడవలో మంటలు

Siva Kodati |  
Published : Aug 08, 2020, 04:23 PM IST
విశాఖను వెంటాడుతున్న ప్రమాదాలు: హార్బర్‌లోని పడవలో మంటలు

సారాంశం

వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న విశాఖ నగరంలో శనివారం మరో ఘటన జరిగింది. నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ చేపల బోటు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బోటు  కాలిపోయింది

వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న విశాఖ నగరంలో శనివారం మరో ఘటన జరిగింది. నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ చేపల బోటు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బోటు  కాలిపోయింది.

ప్రమాదాన్ని గమనించిన మత్య్సకారులు అప్రమత్తమయ్యారు. పోర్ట్ ట్రస్ట్‌కు సమాచారం అందించారు. దీంతో పోర్ట్ అధికారులు మంటలను ఆర్పేందుకు సిబ్బందిని పంపారు. అంతేకాకుండా ప్రమాదంలో దగ్థమైన బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రమాదాన్ని చూసిన స్థానిక యువకులు.. మత్స్యకారులను రక్షించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

Free Bus: ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఆగిపోనుందా.? అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం
అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Minister Atchannaidu Powerful Speech | Asianet Telugu