విశాఖను వెంటాడుతున్న ప్రమాదాలు: హార్బర్‌లోని పడవలో మంటలు

Siva Kodati |  
Published : Aug 08, 2020, 04:23 PM IST
విశాఖను వెంటాడుతున్న ప్రమాదాలు: హార్బర్‌లోని పడవలో మంటలు

సారాంశం

వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న విశాఖ నగరంలో శనివారం మరో ఘటన జరిగింది. నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ చేపల బోటు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బోటు  కాలిపోయింది

వరుస ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న విశాఖ నగరంలో శనివారం మరో ఘటన జరిగింది. నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ చేపల బోటు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బోటు  కాలిపోయింది.

ప్రమాదాన్ని గమనించిన మత్య్సకారులు అప్రమత్తమయ్యారు. పోర్ట్ ట్రస్ట్‌కు సమాచారం అందించారు. దీంతో పోర్ట్ అధికారులు మంటలను ఆర్పేందుకు సిబ్బందిని పంపారు. అంతేకాకుండా ప్రమాదంలో దగ్థమైన బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రమాదాన్ని చూసిన స్థానిక యువకులు.. మత్స్యకారులను రక్షించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు