ప్రేమ వివాహం: నంద్యాలలో కూతురిపై కత్తితో దాడి, నవ వధువు పరిస్థితి విషమం

By narsimha lodeFirst Published Sep 12, 2021, 2:30 PM IST
Highlights

కర్నూల్ జిల్లా నంద్యాలలో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. ప్రేమ పెళ్లి చేసుకొందని  కూతురిని కత్తితో  పొడిచాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  


నంద్యాల:కర్నూల్ జిల్లా నంద్యాలలో కూతురు ప్రేమ వివాహం చేసుకొందని నవ వధువుపై తండ్రి కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నంద్యాలకు చెందిన మళ్లీశ్వరీ తల్లిదండ్రులను ఎదురించి ఇవాళ ప్రేమ వివాహం చేసుకొంది.

ఈ విషయాన్ని తెలుసుకొన్న తండ్రి కోపంతో ఊగిపోయాడు. నవవధువు మల్లీశ్వరీని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

click me!