మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ .. ఇంకా ఫోన్ రాలేదు, జగన్ నిర్ణయమే ఫైనల్ : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Siva Kodati |  
Published : Apr 10, 2022, 04:22 PM IST
మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ .. ఇంకా ఫోన్ రాలేదు, జగన్ నిర్ణయమే ఫైనల్ : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సారాంశం

ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ ఆశావహుల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు . తనకు ఇంకా సీఎంవో నుంచి ఫోన్ కాల్ రాలేదన్న ఆయన .. పదవి వచ్చినా, రాకపోయినా జగన్ ఆదేశాల మేరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. 

మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో తనకు ఇంకా సీఎంవో నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పదవి వచ్చినా, రాకపోయినా జగన్ ఆదేశాల మేరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. 

మరోవైపు సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు (rk roja) మంత్రి పదవి విషయంలో మరోసారి నిరాశే ఎదురైనట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రోజాకు ఈసారి కూడా సీఎం జగన్ కేబినెట్‌లో (ys jagan cabinet) చోటుదక్కలేదని సమాచారం. దీంతో ఆమె అభిమానులు, అనుచరులకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో కేబినెట్ బెర్త్‌పై ఎమ్మెల్యే రోజా ఆశలు పెట్టుకున్నా సంగతి తెలిసిందే. మరోవైపు రోజాకు ఈసారి కేబినెట్ బెర్త్ గ్యారంటీ అనే ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా రోజా వరుసగా పలు ఆలయాలకు వెళుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఆమె జబర్దస్త్ షో జడ్జిగా తప్పుకుంటున్నారనే ప్రచారం జరిగింది. దీంతో రోజాకు కేబినెట్ బెర్త్ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. 

రోజాకు మంత్రివర్గంలో చోటుదక్కడంతోనే మొక్కులు తీర్చుకుంటుందని కొందరు.. మంత్రి పదవి దక్కాలని పూజలు చేస్తున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కుతుందా..? లేదా..? అనేది మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. మంత్రి వర్గంలో రోజాకు చోటు లభించలేదని తెలుస్తోంది. దీంతో రోజా.. హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. రేపు జరిగే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రాజకీయ సమీకరణాల వల్లే రోజాకు మంత్రిపదవి దూరమైనట్టుగా తెలుస్తోంది. 

సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy), నారాయణ స్వామి (narayana swamy) మంత్రులుగా తీసుకున్నారు. అయితే అప్పుడు చెప్పినట్టుగానే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. మంత్రుల చేత రాజీనామా చేయించారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కేబినెట్ రేస్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో అదే సామాజికవర్గానికి చెందిన రోజా, భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదని తెలుస్తోంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు మంత్రి వద్దని చెప్పడంతో.. ఆయనకు తుడా ఛైర్మన్‌ పదవీ కాలాన్ని పొడగించారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్