ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ: ఆశావహుల్లో టెన్షన్.. మాజీ మంత్రి బాలినేనికి హైబీపీ, వైద్యుల పరీక్షలు

Siva Kodati |  
Published : Apr 10, 2022, 02:29 PM ISTUpdated : Apr 10, 2022, 02:35 PM IST
ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ: ఆశావహుల్లో టెన్షన్.. మాజీ మంత్రి బాలినేనికి హైబీపీ, వైద్యుల పరీక్షలు

సారాంశం

మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. చివరి వరకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఒక్కసారిగా హై బీపీకి గురవ్వడంతో వైద్యులు ఆయనకు పరీక్షలు జరిపారు

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivasa reddy) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఒక్కసారిగా హై బీపీకి గురవ్వడంతో వైద్యులు ఆయనకు పరీక్షలు జరిపారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీకరణ నేపథ్యంలో మరోసారి మంత్రి పదవిని ఆశిస్తున్నారు బాలినేని. 

మరోవైపు. ముఖ్యమంత్రి YS Jaganతో ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy, సీఎంఓ అధికారులు ఆదివారం నాడు భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు సంబంధించి సీఎం జగన్ చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను ప్రభుత్వం పంపనున్నారు. గత మంత్రివర్గం నుండి 10 మందికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే కొత్తగా 25 మందికి అవకాశం కల్పించనున్నారు. మంత్రి వర్గ కూర్పుకు సంబంధించి సామాజిక సమీకరణాలు, ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నారు.  ఈ మేరకు కేబినెట్ లో  చోటు దక్కనుంది. అయితే Cabinetలో చోటు దక్కుతుందనే  ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద వారి అభిమానులు సందడి చేస్తున్నారు.

విశాఖపట్టణం జిల్లాలో గుడివాడ అమర్ నాథ్ కు కేబినెట్ లో చోటు దక్కిందనే ప్రచారంతో ఆయన అభిమానులు అమర్ నాథ్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అయితే తనకు ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని అమర్ నాథ్ చెప్పారు. సీఎం ఏ బాధ్యత అప్పగించినా కూడా తాను క్రమశిక్షణగా నిర్వహిస్తానని అమర్ నాథ్ చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కేబినెట్ లో బెర్త్ దక్కిందనే ప్రచారం కావడంతో  గోవర్ధన్ రెడ్డి అభిమానులు ఆయనను సన్మానించారు. స్వీట్లు తినిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు నిర్వహించారు. మరో వైపు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కిందనే ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు.మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్, విడుదల రజని, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు  ఖరారైనట్టుగా ప్రచారం సాగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ ముగిసిన తర్వాత కొత్త మంత్రుల పేర్లు సీఎం జగన్ రాజ్‌భవన్ కు పంపనున్నారు. దీనికి గవర్నర్  ఆమోదం తెలిపిన తర్వాత కొత్త మంత్రులకు సీఎంఓ నుండి సమాచారం అందనుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!