అక్రమాలు చేశానని నిరూపిస్తే ఉరి వేసుకొని చస్తా: మాజీ మంత్రి సవాల్

Published : Jul 16, 2024, 01:44 AM IST
అక్రమాలు చేశానని నిరూపిస్తే ఉరి వేసుకొని చస్తా: మాజీ మంత్రి సవాల్

సారాంశం

ఒంగోలులో అధికార పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆక్షేపించారు. దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు సవాలు విసిరారు.  

ఒంగోలు: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేయడం దారుణమని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఆక్షేపించారు. ఇలాంటి వైఖరిని గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అవలంబించలేదన్నారు. దమ్ముంటే త‌న‌ను ఎదుర్కోవాల‌ని, తాను ఎక్క‌డికి వెళ్ల‌న‌ని ఒంగోలులోనే ఉంటాన‌ని స‌వాలు విసిరారు. టీడీపీ నేత‌ల తీరును బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఎండ‌గ‌ట్టారు. 

మాజీ మంత్రి బాలినేని ఇంకా ఏమ‌న్నారంటే..

‘‘నేను 5 సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచా.. ఎప్పుడూ టీడీపీ వాళ్ల మీద దాడులు చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉద్దేశపూర్వకంగా మా కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నాడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. నేను ఒంగోలు ఎంఎల్ఏగా ఉన్నప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నాకివే చివరి ఎన్నికలని... ఎన్నికలు ముందే చెప్పాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతీపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలపై టీడీపి వాళ్లు దాడులు చేశారు. ఇది మంచి పద్దతి కాదు. నేను రాజకీయాలు వద్దు అనుకున్నా... కానీ మా కార్యకర్తలపై దాడులు చేశాక మళ్లీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా.’’

‘‘ఓ చోట నాయుకుడు అబ్బా కొడుకులు పారిపోయారని ఫ్లెక్సీలు వేయించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నన్ను హవాలా మంత్రి, భూ కబ్జాదారుడు అన్నారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది నాపై ఆరోపణలు తేల్చండి. నేను అధికారంలో ఉన్నప్పుడు నాపై ఆరోపణలు చేశారు.. వాటిని నిరూపించండి. వైఎస్ఆర్‌సీపీ నేతలు టీడీపిలోకి వెళ్లాక మంచోళ్లు అయ్యారా..? మా వియ్యంకుడు విల్లాలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. అక్రమాలు నిరూపించండి. టీడీపి ఎమ్మెల్యే జనార్దన్ మా వ్యాపారులపై గురిపెట్టారు. ఎమ్మెల్యే జనార్దన్.. దమ్ము ఉంటె నేరుగా నన్ను ఎదుర్కో.. నావాళ్ల‌ జోలికి వస్తే ఊరుకోను. ఒంగోలు లేవట్లలో అక్రమాలు చేశానని నిరూపిస్తే నేను ఉరి వేసుకుంటా.. చస్తా... అని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే జనార్దన్ ఇప్పుడు అందరికీ నోటీసులు ఇచ్చి వేధిస్తున్నాడు. నేను ఒంగోలు నుంచి పారిపోయానని ఫ్లెక్సీ వేయించావు. నేను పారిపోలేదు.. ఒంగోలులో ఉంటా.... పార్టీ మారేది లేదు. నేను ప్రజా పోరాటానికి సిద్ధం’’ అని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి స‌వాలు విసిరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు