మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం...కారు ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

Published : Aug 22, 2018, 03:40 PM ISTUpdated : Sep 09, 2018, 01:43 PM IST
మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం...కారు ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

సారాంశం

మాజీ మంత్రి,  వైఎస్సార్ సిపి పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బైటపడ్డారు.

మాజీ మంత్రి,  వైఎస్సార్ సిపి పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బైటపడ్డారు.

ఇవాళ ఉదయం బాలినేని తన కారులో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుండి త్రోవకుంటకు వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతుండగా కారు టైరు పేలడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ క్రమంలో కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనదారుడు మార్నేని అంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు అదుపుతప్పినప్పటికి రోడ్డు పక్కనే ఆగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది.   
  

PREV
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers