సింహాచలంలో కూలిన ధ్వజస్తంభం... సింహగిరి సీతారామస్వామి ఆలయంలో ఘటన..

By AN TeluguFirst Published Aug 11, 2021, 10:13 AM IST
Highlights

పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పుచ్చి పోవడంతో అది కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. 

సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానం ఉప దేవాలయం శ్రీ సీతారామ స్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కూలిపోయింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పుచ్చి పోవడంతో అది కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. 

వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచలం దేవస్థానం ఈవో సూర్య కళ తెలిపారు.

click me!