నన్ను వెలివేశారంటూ చిన్నారి లేఖ.. స్పందించిన సీఎం జగన్

By telugu teamFirst Published Sep 14, 2019, 1:43 PM IST
Highlights

తమను వెలివేశారని... స్కూల్లో కూడా ఎవరూ తనతో మాట్లాడటం లేదని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో స్కూల్లో  ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

తనకు సహాయం చేయాలని కోరుతూ ఓ చిన్నారి రాసిన లేఖ రాసిందంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్  జగన్ స్పందించారు. ఆ చిన్నారి సమస్య గురించి పూర్తిగా తెలుసుకొని  వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.

తమను వెలివేశారని... స్కూల్లో కూడా ఎవరూ తనతో మాట్లాడటం లేదని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో స్కూల్లో  ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి విషయం గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

click me!