నాకే మెమో ఇస్తావా : నంద్యాల మున్సిపాలిటీలో కమీషనర్ VS అసిస్టెంట్ కమీషనర్

Siva Kodati |  
Published : Aug 16, 2022, 03:24 PM IST
నాకే మెమో ఇస్తావా : నంద్యాల మున్సిపాలిటీలో కమీషనర్ VS అసిస్టెంట్ కమీషనర్

సారాంశం

నంద్యాల మున్సిపాలిటీలో అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా కమీషనర్ వర్సెస్ అసిస్టెంట్ కమీషనర్ అన్నట్లుగా పరిస్ధితి నెలకొంది. కమీషనర్ ఎదుటే మెమో కాపీలను చింపేశారు అసిస్టెంట్ కమీషనర్. కమీషనర్‌గా పనిచేశానని.. రూల్స్ తనకు తెలుసునంటూ వాగ్వాదానికి దిగారు. 

నంద్యాల మున్సిపాలిటీలో అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యంగా కమీషనర్ వర్సెస్ అసిస్టెంట్ కమీషనర్ అన్నట్లుగా పరిస్ధితి నెలకొంది. సచివాలయ సిబ్బంది కేటాయింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం క్లర్క్, మేనేజర్‌కు మెమోలు జారీ చేశారు అధికారులు. అలాగే నిర్లక్ష్యం వహించారని అసిస్టెంట్ కమీషనర్ మోహన్‌దాస్‌కు కూడా మెమో జారీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసిస్టెంట్ కమీషనర్ మోహన్‌దాస్... కమీషనర్‌పై స్థిరపడ్డారు. కమీషనర్ ఎదుటే మెమో కాపీలను చింపేశారు అసిస్టెంట్ కమీషనర్. కమీషనర్‌గా పనిచేశానని.. రూల్స్ తనకు తెలుసునంటూ వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు అసిస్టెంట్ కమీషనర్. అధికారుల మధ్య విభేదాలతో సిబ్బందిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం