కారణమిదీ: రేణిగుంట ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సురేష్ పై కేసు

Published : Aug 17, 2021, 12:18 PM IST
కారణమిదీ: రేణిగుంట ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సురేష్ పై కేసు

సారాంశం

రేణిగుంట ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేషన్ పై చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో స్థానిక గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసు నమోదు చేశారు. భూ పరిహారం అడిగిన తమపై సురేష్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.


తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు.  భూ పరిహారం అడిగిన గ్రామస్తులను బెదిరించినందుకు గాను డాక్టర్ సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం తమ నుండి తీసుకొన్న భూమికి సంబంధించిన పరిహారం చెల్లించాలని ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేషన్ ను గ్రామస్తులు కోరారు. అయితే గ్రామస్తులపై సురేష్ దురుసుగా మాట్లాడారు. తన వద్ద భద్రతా సిబ్బంది ఉన్నారని వారితో కాల్చి చంపుతానని ఆయన  బెదిరించినట్టుగా గ్రామస్తులు ఆరోపించారు.ఈ విషయమై స్థానిక ఆర్డీఓకి  స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు  ఎయిర్ పోర్టు డైరెక్టర్ పై  కేసు నమోదు చేయాలని ఆర్డీఓ అధేశించారు. ఆర్డీఓ ఆదేశం మేరకు ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఏర్పేడు పోలీసుస్టేషన్ లో రేణిగుంట ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సురేష్ పై ఐపీసీ 385,166,268,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు